ప్రధానోపాధ్యాయుల సమక్షంలో పాఠశాల పారిశుధ్య సహాయకులకు శిక్షణ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జూన్ 11 బుధవారం రోజున కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కోరుట్ల మండల స్థాయి ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నత,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్,ప్రధానోపాధ్యాయులకు మరియు పాఠశాల పారిశుధ్య సహాయకులకు (స్కావేంజర్) శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ ప్రతి పాఠశాల పరిసరాలు,బాల ,బాలికల మూత్రశాలలు,తరగతి గదులు , పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మండలంలోని అన్ని పాఠశాలలు తరగతి గదులు, మూత్రశాలలు, వంటగది మొదలగునవి అన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో అల్లమయ్య గుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.అనిల్ గారు మాట్లాడుతూ వర్ష కాలం కాబట్టి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి నీటి నిల్వలు పాఠశాల ఆవరణలో ఉండకుండా చూడాలని చెప్పారు. స్కావెంజర్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువచ్చినచో మేము ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి మార్గం రాజేంద్రప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.ఆనందరావు,ఎ. శ్రీనివాస్,నల్ల భూమయ్య, సిహెచ్ కృష్ణ మోహన్ రావు, రిసోర్స్ పర్సన్ శ్రావణ్ కుమార్,సి.ఆర్.పి లు పి.గంగాధర్, జ్యోతి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.



