viswatelangana.com
Date of Publish : 17 May 2024, 12:59 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఈత వనం దగ్ధం

భీమారం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల యొక్క ఐదేకరాల విస్తీర్ణంలో దాదాపు 3000కు పైగా ఈత చెట్లు పెట్టడం జరిగింది. సుమారుగా అందులో 900కు పైగా చెట్లు కల్లు గీయడానికి ఏపుగా పెరిగినవి. కానీ ప్రమాదవశత్తు నిప్పు అంటుకొని అయిదు ఎకరాలలో ఉన్న మూడువేల పైగా ఈత చెట్లు పూర్తిగా పనికిరాకుండా దగ్ధం కావడం జరిగింది. కళ్ళు గీసుకుని జీవనం సాగిస్తున్న తరుణంలో ఈ విధంగా నష్టం జరగడం వల్ల జీవనోపాధి కోల్పోతామని కాబట్టి ప్రభుత్వం మా గౌడ కులస్తులను ఆదుకోవాలని వారు కోరడం జరిగింది.

Change News Type