viswatelangana.com
Date of Publish : 17 June 2025, 12:55 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో గేదెలు మృతి

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బ్రిడ్జి సమీపంలో విద్యుత్ వైర్లు తెగి, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గ్రామానికి చెందిన ముగ్గురి రైతులకు చెందిన 3 పాడి గేదలు మృతి చెందాయి. తమకు ఉపాధి అందించే గేదెలు చనిపోవడం తో పాడి రైతులు దండవేణి అంతయ్య, మారసు గంగారాం, గడికొప్పుల మల్లేశం కన్నీరు మున్నిరయ్యారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగినంత సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Change News Type