కోరుట్ల పట్టణంలోని సాయి రాంపుర కాలనీలో వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రో: కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు సంఘ భవనం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బొమ్మెన జలంధర్, ఇంద్రాల మల్లేశం, గోగులకొండ జగదీశ్, వన తడుపుల రమణ, లక్కాకుల సద్గురు, రాధారపు సత్యనారాయణ, ఉప్పులుటి రాఘవులు, విజయ్, సంకోజి రవి, తదితరులు పాల్గొన్నారు.