viswatelangana.com
Date of Publish : 06 June 2025, 1:10 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మైతాపూర్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరడమైనది. అనంతరం బడిబాట ప్రతిజ్ఞ, ర్యాలీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గోపి రాజరెడ్డి తలారి రాజేష్, గన్నే రాజరెడ్డి పంచాయతీ కార్యదర్శి వేణు, కారోబరి నరేష్,ఏ ఏ పి సి చైర్మన్ శ్యామల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు కల్పన, మహేష్, రామాంజలి, జ్యోతి, అంగన్వాడి టీచర్లు మమత, పద్మలత, బంతి, శాంత, ఆశా వర్కర్లు గంగ నర్సు, శంకరమ్మ, మమత, తులసి, తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type