కథలాపూర్

మత్తు లో యువత జీవితం చిత్తు

viswatelangana.com

July 30th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

నేడు ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవర పేడుతున్న భయంకరమైన సమస్యలలో మాదకద్రవ్యాల తయారీ అక్రమ రవాణా వినియోగం అత్యంత ముఖ్యమైనది, వీటిని అరికట్టడానికి చాలా దేశాలు కఠిన చట్టాలను, శిక్షలను సైతం అమలు చేస్తూ ఈ సమస్యను యుద్ధంతో సమానమైన తీవ్రతగా పరిగణిస్తున్నాయి. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ ) డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ తాలూకా మల్లేష్ మాట్లాడుతూ. విద్యార్థులు అలాగే యువత సన్మార్గంలో నడవాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అలాగే ఈమధ్య కొన్ని కోట్ల మంది డ్రగ్స్ బారిన పడి, దానికి బానిసలా మారుతూ ఈ వ్యసనాల బారి నుంచి బయటపడలేక సతమతమవుతున్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసుకుని విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారు. యువతను పట్టిపీడిస్తున్న ఈ మత్తు పదార్థాలపై ప్రభుత్వం మరియు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అలాగే కుటుంబ సభ్యుల సహకారం మరియు ఉపాధ్యాయుల సహకారం తప్పనిసరి అని ఆయన తెలిపారు..

Related Articles

Back to top button