viswatelangana.com
Date of Publish : 26 February 2024, 2:34 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మన్నెగూడెం ఫ్రెండ్ షిప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత గా కట్లకుంట.
featured

భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామంలో నిర్వహించిన ఫ్రెండ్ షిప్ క్రికెట్ టోర్నమెంటలో నాలుగు మండలాలకు చెందిన 38 టీం ల క్రిడాకారులు పాల్గొన్నారు.నేడు ఫైనల్ మ్యాచ్ జరుగగా తొంబరావు పేట రన్నర్ గా నిలవగా , విన్నర్ గా కట్లకుంట కైవసం చేసుకుంది. టోర్నమెంట్ నిర్వాహకులు మ్యాదర్ రమేష్, సూర్యం చక్కగా టోర్నమెంట్ నిర్వహించినట్లు క్రిడాకారులు తెలిపారు. గెలుపొందిన క్రిడాకారులకు ముఖ్య అతిధిలు ఎస్ ఎన్ రెడ్డి, గంట శంకర్ లు అవార్డులు అందజేశారు. ఎస్ ఎన్ రెడ్డి, గంట శంకర్ లు మాట్లాడుతూ క్రిడలు మనసుకు ఆనందాన్ని ఇస్తామని క్రిడాకారులకు శారీరక దారుడ్యన్ని కలుగజేస్తాయని, మనోధైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

Change News Type