కథలాపూర్
ఎల్ ఓ సి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

viswatelangana.com
May 22nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన కే. పద్మ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 85,000/- రూపాయలు మంజూరు చేయించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



