viswatelangana.com
Date of Publish : 04 March 2024, 4:19 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
యాదవ బిడ్డకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మద్దతు తెలిపాలి
featured

మండల కేంద్రంలోని స్థానిక పిఎన్ఆర్ గార్డెన్ లో సోమవారం మండల యాదవ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అఖిలభారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా యాదవ కమిటీ ప్రెసిడెంట్ పలుమారు మల్లేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో ఆది శీనన్నకు తన గెలుపులో మా పాత్ర ఎంతగానో ఉన్నా ఉందని యాదవులను చిన్న చూపు చూడకుండా మమ్మల్ని గుర్తించి మేడిపల్లి మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ను మా యాదవ బిడ్డకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి వెంకటస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టే హన్మండ్లు యాదవ్, జిల్లా ఉపధ్యక్షుడు బండ మల్లేష్ యాదవ్, జంగిలి కనుకయ్య, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి అదే లక్ష్మిరాజం, మేడిపల్లి మండల అధ్యక్షుడు అదే రమేష్ భీమవరం మండల అధ్యక్షుడు రెబస్ మల్లయ్య, మండల అధికార ప్రతినిధి మీసాల బీమయ్య, జిల్లా కార్యదర్శి ధ్యనవెని మల్లేష్ , కోరుట్ల మండల అధ్యక్షులు కొండవెని దేవయ్య, కథలపూర్ మండల అధ్యక్షులు అషన్న యాదవ్, మల్యాల మండల ఉపాధ్యక్షుడు నెళ్ళవెని మల్లేశం, బీమరం మండల ఉపాధ్యక్షుడు భూమన్న, జిల్లా యూత్ నాయకులు రెబ్బటి రాజశేఖర్, ముక్కెర శ్రీను మండలంలోని యాదవ సంఘం సోదరులు పాల్గొన్నారు.

Change News Type