కథలాపూర్ మండలం పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నీ యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ ఎస్ యు ఐ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దొమ్మాటి అర్జున్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా కథలాపూర్ మండలం ఉన్న విద్యాసంస్థలు అన్ని బంద్ చేయడం జరిగినది. నీట్ పరీక్షలు లీకేజ్ పై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందన లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వా వైఖరి కి నిరసనగా విద్యాసంస్థలన్నిటిని బంద్ పిలుపునివ్వడంతో కథలాపూర్ మండలం పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నిటిని బంద్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల యువజన కాంగ్రెస్ మరియూ ఎన్ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు