యెకీన్ పూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్వచ్ఛత హి సేవ

viswatelangana.com
స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2024 సెప్టెంబర్ 17 నుండి 02 అక్టోబర్ 2024 అక్టోబర్ 02 వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశానూసారం యెకీన్ పూర్ లోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, పోస్టర్స్ మరియు బ్యానరులను రిలీజ్ చేసారు. అదేవిదంగా విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించి, వ్యాసరచన పోటీ నిర్వహించారు. అలాగే పాఠశాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాల పరిసరాలను శుభ్రం చేసారు. ఈ స్వచ్ఛత హి సేవ కార్యక్రమములో భాగంగా సెప్టెంబర్ 17 నుండి, అక్టోబర్ 1 వరకు పట్టణంలోని ప్రజలకు మరియు విద్యార్థిని, విద్యార్థులకు ఈ కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ పట్టణమును పరిశుభ్రంగా ఉంచడం కోసం కృషి, అలాగే అక్టోబర్ 2న స్వచ్ఛతపై కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గోనెల మహేష్, మున్సిపల్ సిబ్బంది అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



