viswatelangana.com
Date of Publish : 03 February 2025, 5:07 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రెమ్యూనరేషన్ ఇవ్వాలి

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే ఇవ్వాలని ఎంపిడివో కు పిఆర్టియు టిఎస్ మండల శాఖ ఆధ్వర్యంలోసోమవారం వినతి పత్రం సమర్పించారు. విధుల్లో పాల్గొన్న సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, కుంబాల శ్రీనివాస్, గాజంగి రాజేశం, జిల్లా కార్యదర్శి దొంతి సతీష్, కడకుంట్ల అభయ్ రాజ్, సిలివేరి రమేష్,మాచర్ల మహేష్, ఊసకోల రాము, బెజ్జంకి హరికృష్ణ, ద్యావనపల్లి సురేష్, తాటిపాముల రమేష్ లు పాల్గొన్నారు.

Change News Type