viswatelangana.com
Date of Publish : 28 February 2024, 5:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సరస్వతి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే
featured

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని కొండాపూర్ గ్రామంలో సరస్వతి విద్యాలయంలో బుధవారం రోజున నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ పరికరాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎద్దులాపురం దయాకర్ మాట్లాడుతూ సర్ సివి రామన్ కు 1930 సంవత్సరంలో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి వరించింది అని అన్నారు. ఈ సందర్భంగా 1987 సంవత్సరం నుండి ఫిబ్రవరి 28 రోజున ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. 1888 నవంబర్ 7 నా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచపల్లి గ్రామంలో ఆయన జన్మించాడు అని అన్నాడు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏదిలాపురం పద్మశ్రీ, ఉపాధ్యాయులు మంద సునీత, తోపారపు సోనీ, కుంట రమ్య, మేడిపల్లి దివ్య, వడ్లగట్ట సుప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు.

Change News Type