viswatelangana.com
Date of Publish : 21 June 2024, 1:27 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సరస్వతి విద్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామం శ్రీ సరస్వతీ విద్యాలయం లో శుక్రవారం రోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు యోగా, మెరిటేషన్ క్లాస్ లను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎదులాపురం దయాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యోగా అనేది ఒక సరళమైన ప్రక్రియ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని, ప్రతీ ఒక్కరూ ప్రతిరోజూ యోగచేయటం వలన మనస్సు శరీరం ఏకమై రోగాలు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎదులాపురం పద్మశ్రీ, ఉపాద్యాయులు శ్రీవేద, లావణ్య, సుప్రియ, సునీత, మమత, దివ్య, రమ్య, సోని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type