viswatelangana.com
Date of Publish : 05 September 2024, 12:30 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగిస్తున్న వారికీ జరిమానా

కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్లాస్టిక్ ఏజెన్సీలు, కిరాణా షాపులు, హోటల్స్ అలాగే బేకరీలలో తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని 5 వేల 5 వందల రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు పరిశుభ్రతను తనిఖీ చేసారు. అదేవిధంగా బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య, ప్రసాద్, రమేష్ ,రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Change News Type