viswatelangana.com
Date of Publish : 02 October 2024, 2:21 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
స్వచ్ఛభారత్ దివస్ కి గాను కోరుట్ల

స్వచ్ఛభారత్ దివస్ ని పురస్కరించుకొని స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా జరుగుతున్న పురస్కారాలకు తెలంగాణ నుంచి 4 మున్సిపాలిటీలు ఎంపికయ్యారు దీనిలో ఒకటి కోరుట్ల పట్టణం కావడం గర్వకారణం. దీనిని పురస్కరించుకొని ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి డీఎంఏ గౌతమ్ కలిసి చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి హాజరవుతూ దీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ కి ఇక ముందు కూడా అన్ని పట్టణాలు సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఇలాగే ఇకముందు కూడా కొనసాగుతుందని, ఇది అందించే పురస్కారాలను పట్టణాలు అందుకోవాలని ఆయన తెలిపారు. దీనిని ఉద్దేశించి చైర్ పర్సన్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వీటికి హాజరు కావడం తమకు గర్వంగా ఉందని, వారు తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు,పరిశుద్ధ కార్మికులు అందరి కృషి వాళ్ళని మన పట్టణం ఈ స్థానంలో ఉందని వారందరి ధన్యవాదాలు తెలిపారు.

Change News Type