కోరుట్ల

వ్యర్ధాల నిర్వహణపై అధికారులకు అవగాహన

viswatelangana.com

March 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికే శ్రీదేవి ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపాలిటీలో ఘన వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంపోస్టింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత రావడం జరిగింది. కంపోస్టిక్ సంబంధించిన నిర్వహణ ఏ విధంగా చేపట్టాలి దానికి సంబంధించిన సలహాలు సూచనలను అవగాహన కార్యక్రమానికి వివిధ మున్సిపాలిటీ నుంచి వచ్చిన మున్సిపల్ కమిషనర్లకు శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కంపోస్టింగ్ విధానం కోరుట్లలో ఏ విధంగా జరుగుతుంది స్వయంగా తెలుసుకోవడమే కాకుండా డి ఆర్ సి సి ని కూడా సందర్శించడం జరిగింది. అంతేకాకుండా డి ఆర్ సి సి నందు ఏ విధంగా రీసైక్లింగ్ పంపుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి అలాగే అవగాహన కార్యక్రమానికి హాజరైన వివిధ మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, డిఈలు, ఏఈలు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు అలాగే ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button