జగిత్యాల

జిల్లా వైద్యాధికారి కార్యాలయం జగిత్యాల

viswatelangana.com

May 31st, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జిల్లా స్థాయి బహుళ సభ్యుల అధికారిక సమావేశం(PC&PNDT Act 1994) సమావేశం శ్రీ బుడుమజ్జి సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, మరియు చైర్ పర్సన్ డి ఎల్ ఎం ఎం ఏ ఏ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో అనే విస్తృతమైన ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. గర్భవతిగా నమోదు అయినప్పటి నుండే ఆశా కార్యకర్తలు ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ చేయవలెనని తెలిపారు. స్కానింగ్ సెంటర్లలో గర్భవతులకు స్కానింగ్ చేసినప్పుడు విధిగా ఫారం F లను నింపవలెనని దానిని ఆన్లైన్లో నమోదు చేయవలెను అదేవిధంగా అబార్షన్ జరిగినటువంటి వారీపైన ప్రత్యేక శ్రద్ధ చూపించవలెనని, ఏ కారణం చేత అబార్షన్ అయిందో గ్రహించవలనని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో దరఖాస్తు చేసుకున్నటువంటి మూడు నూతన స్కానింగ్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ మరియు 10 రెన్యువల్ సెంటర్స్ కు అనుమతి ఇచ్చే విషయం గురించి కలెక్టర్కు నివేదించడం జరిగిందనీ తెలిపారు. కమిషనర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గారి ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిబంధనలు అతిక్రమించిన మూడు స్కానింగ్ సెంటర్లకు జరిమానా విధించడం మరియు హెచ్చరిక నోటీసులు జారీ చేయడం గురించి వివరించారు. మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ కోసం అమలవుతున్న నియమ నిబంధనలను కమిటీ తో చర్చించారు. ప్రతినెల form “F” మరియు ఆన్లైన్ పోర్టల్ లో పొందు పరుచడం. 5వ తారీఖు లోపల వారికి కేటాయించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కార్యాలయంలో సమర్పించవలెనని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 78 స్కానింగ్ సెంటర్స్ అనుమతి పొంది ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి డాక్టర్ సుధీర్ ,హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం ఆరోగ్య పర్యవేక్షకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button