కథలాపూర్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

viswatelangana.com
July 10th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ శివారులో నుండి టి.ఎస్. 16 యుబి 0786 అను లారీ లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కథలాపూర్ రెవెన్యూ అధికారులు అట్టి లారీని పట్టుకొని వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకపోవడంతో కథలాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి దరఖాస్తు ఇవ్వగా అట్టి లారీ డ్రైవర్ అయిన షిందే శంకర్ s/o ప్రకాష్ r/o ఆర్మూర్ మరియు లారీ యాజమాని అయిన పల్లెపు రాజేందర్ s/o బాపు రావు r/o బ్రాహ్మణపల్లి గ్రామం, జక్రాన్పల్లి మండలం అను వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు.


