కోరుట్ల

నెంబర్ ప్లేట్ లేని బైకుతో వచ్చి కిడ్నాప్ కు యత్నం

viswatelangana.com

March 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని సాయిరాం పురా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై కాలనీకి వచ్చారు. అడ్రస్ చెప్పాలని ఇద్దర పిల్లలను బైకు ఎక్కించుకున్నారు. అక్కడే ఉన్న కొందరు గమనించి ఎవరు మీరు అని ప్రశ్నించారు. కాలనీ వాసులంతా గుమిగూడటంతో పిల్లల్ని వాహనం దింపి ఒక్కసారిగా అక్కడినుంచి పరుగులు తీశారు. దీంతో వారు కిడ్నాప్ కు యత్నించారని భావించారు. అప్రమత్తంగా ఉండటంతో పిల్లలను కాపాడుకోగలిగామని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు.

Related Articles

Back to top button