హైదరాబాద్

TSPSC | టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం

viswatelangana.com

January 25th, 2024
హైదరాబాద్ (విశ్వతెలంగాణ) :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. స్క్రీనింగ్ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించినా చివరకు మహేందర్ రెడ్డినే టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది.
1962 డిసెంబర్‌ 3న జన్మించిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మ‌హేంద‌ర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవ‌లందించారు. పోలీసు శాఖ‌లో సాంకేతిక‌త‌తో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చారు మ‌హేంద‌ర్ రెడ్డి. 2022, డిసెంబ‌ర్ 31వ తేదీన మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

Related Articles

Back to top button