మెట్ పల్లి

కాళోజి జయంతి వేడుకలు

viswatelangana.com

September 9th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాళోజి నారాయణరావు జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల, విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కవితల ద్వారా ఎండగట్టిన గొప్ప వ్యక్తి అని . “ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక” అంటూ తెలంగాణ ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉన్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్, మరియు అధ్యాపకులు సిహెచ్ శ్రీనివాస్, జగపతి,శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య, సుదర్శన్, స్వర్ణలత, మంజుల, కిరణ్ కుమార్, జాకీర్, జమున, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button