కోరుట్ల
కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత సప్తాహం ప్రవచనం

viswatelangana.com
March 23rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అభినవ సుఖ భాస్కర శర్మ గారిచే భాగవత సప్తాహం ప్రవచన కార్యక్రమం ఆదివారం నాలుగవ రోజు ఆసక్తికరంగా జరిగింది. నరసింహ అవతారం గురించి, ప్రహ్లాదుని భక్తి ప్రపత్తుల గురించి, భగవంతుని చేరుకోవడానికి భక్తి ఒక్కటే మార్గమని అత్యంత రసవత్తరంగా వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొత్త సురేష్, కొత్త సుధీర్, అల్లాడి ప్రవీణ్, అల్లాడి మహేష్, కూరగాయల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.



