కోరుట్లలో సామాజికవేత్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా కోరుట్ల సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీత, ప్రాణదాత కటుకం గణేష్ కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో 2007 సంవత్సరంలో రక్తదాన ఉద్యమం ప్రారంభించి, నేటికి 17 సంవత్సరాలలో 4250 మంది రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించిన కటుకం గణేష్ అభినందనీయుడని వారు పేర్కొన్నారు. ఒకప్పుడు రక్తం దొరకగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న కటుకం గణేష్ ధన్యజీవని వారు పేర్కొన్నారు.ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, న్యాయవాది బొడ్ల శ్రీనివాస్, హరిస్మరణరెడ్డి, డాక్టర్ వేముల రవి కిరణ్, నీలి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



