రాయికల్

బిజెపి పట్టణ అధ్యక్షులుగా కుర్మమల్లారెడ్డి

viswatelangana.com

May 6th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన కుర్మ మల్లారెడ్డిని బిజెపి పట్టణ అధ్యక్షులుగా నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ప్రకటించారు. 2002-2004 వరకు ఏబీవీపీ మండల కన్వీనర్ గా, గతంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా,రాష్ట్ర కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా క్రియాశీలకంగా పనిచేశారు. మల్లారెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్షులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన ఎంపి ధర్మపురి అరవింద్, మాజీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో బీజేపీ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.

Related Articles

Back to top button