రాయికల్
జాతీయస్థాయి 2024 అండర్ 14 కబడ్డీ లో సత్తా చాటిన సుచేంద్ర

viswatelangana.com
May 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జాతీయ స్థాయి 2024 అండర్ 14 కబడ్డీ పోటీలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో జరగగా తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున మన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయులు: మిట్టపెల్లి రవీందర్ రావు గారి కుమారుడు మిట్టపెల్లి సూచేంద్ర రావు జట్టులో చక్కని ప్రతిభ కనబర్చాడు ఈయొక్క పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు రెండవ స్థానంలో నిలిచింది మన రాష్ట్రo తరపున మన మండల క్రీడాకారుడు సూచేంద్ర పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చినందుకు గ్రామ ప్రజలు బందు మిత్రులు సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.



