కథలాపూర్

జులై 7 న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని పిలుపు

viswatelangana.com

July 5th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపెల్లి లక్ష్మణ్ మాదిగ అన్నారు. శనివారంకథలాపూర్ మండల కేంద్రంలోఎమ్మార్పీఎస్ నూతన జెండా గద్దె నిర్మాణం కోసం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపెల్లి లక్ష్మణ్ మాదిగ భూమి పూజ చేయడం జరిగింది.ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారంపల్లి వినోద్ మాదిగ అధ్యక్షతన కార్యక్రమ నిర్వహించారు. ఈ సందర్భంగాఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టు పెల్లి లక్ష్మణ్ మాదిగ హాజరై మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానత లు లేని నూతన సమాజ నిర్మాణం కోసం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు. మాదిగ సమాజానికి దక్క వలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణ కు గురైన వర్గాలైన వికలాంగులు, వృద్దులు, వితంతువుల, కోసం పోరాడి వారికి పెన్షన్ల పెంపుదలకై ఉద్యమం నిర్వహించారని గుర్తు చేశారు.గుండె జబ్బుల చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్లు, అయ్యేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు ఆకలి కేకలు అనే కార్యక్రమం నిర్వహించి అప్పటి ప్రభుత్వంతో పోరాడి నాలుగు కిలోల నుండి 6, కిలోల బియ్యం పెంపుదలకై ఉద్యమం నిర్వహించారని అన్నారు.. ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం చేసినవి కావని, అన్ని వర్గాల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అన్నారు. కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు. మాదిగల కోసం గత 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటాలు ధర్నాలు, రాస్తారోకోలు చేసి వర్గీకరణ సాధించా మని అన్నారు. రాజీలేని పోరాటం విజయవంతమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎస్సీ, వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే నని అన్నారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టిన ప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిలబడలేక పోయా యని అన్నారు. ఎమ్మార్పీఎస్ మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు. సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచణతో ముందుకు సాగు తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ 31, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపు పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, జగిత్యాల జిల్లా సీనియర్ నాయకులు కాశవతుల లక్ష్మీరాజం మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారంపల్లి వినోద్ మాదిగ, కథలాపూర్ మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్దినేని నాగేశ్వరరావు, నల్ల గంగారెడ్డి, రాజ్యం, శంకర్, అంకయ్య, సాయబు, మాదిగ సంఘం పెద్దమను షులు మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button