జగిత్యాల

జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలి

టిఎవైఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపణ

viswatelangana.com

April 1st, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

భారత మజీ ఉప ప్రధాని, సమాతవాది, పూజ్యశ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని గత పదకొండు సంవత్సరాలుగా భూమి పూజతోనే సరిపెట్టుకోవడం సబబుగా లేదని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం జరిగిన మాదిగ సంఘాల సమావేశంలో పేట భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 5 వ తేదిన దేశ వ్యాప్తంగా అధికారికంగా జరిగే బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవాలను పురష్కరించుకోని జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. గత పదకొండు సంవత్సరాల క్రితమే జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తాలో విగ్రహం ఏర్పాటుకు అధికారికంగా భూమి పూజ చేశారని, మున్సిపల్ పాలక పక్షం సైతం ఏకగ్రీవ తీర్మానం చేసిందని, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం తీసుకవచ్చి రోజులు గడుస్తూ మూలన మగ్గుతున్న దాన్ని నెలకొల్పడంలో చలనం లేదని ఇకనైనా జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటులో అడ్డుతగులుతున్న అక్కడి ప్రాంత వాసులను సమన్వయం చేసి ఈనెల 5న జరగబోయే జయంతోత్సవాలకు విగ్రహం నెలకొల్పాలని అక్కడే జయంతి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వాన్ని పేట భాస్కర్ కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించడమైనది. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు, జయంతోత్సవాల కమిటీ ప్రతినిధులు నక్క విజయ్, బొల్లి శేఖర్, బెజ్జెంకి సతీస్, బంగారు దీపక్, దుమాల రాజ్ కుమార్, బొనగిరి దేవయ్య , బొల్లే గంగారాం, బొల్లంపల్లి సంపత్ కుమార్, కొంగర పవన్, గజ్జెల రాజు, నక్క రమేష్,ముదిగం రాజేందర్, దాసరి సతీష్, బొనగిరి నారాయణ, పూడురి శోభన్ మాజీ ఎంపిపిలు దర రమేష్ బాబు, మకిల్ ఇజ్రయిల్ నాయకులు ఎస్ రాజయ్య, బి రాజ్ కుమార్, నక్క గంగాధర్, దుమాల గంగారాం, బడుగు రాజేందర్, సంగెపు ముత్తు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button