ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా చట్టం కోరుట్ల లో అమలు పర్చాలి

viswatelangana.com
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానటిరింగ్ అండ్ ప్రొటెక్షన్) ద్వారా స్పెషల్ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కోరుట్లలో అమలు చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు. శనివారం కోరుట్లలోని సి.ప్రభాకర్ గ్రంథాలయంలో అధ్యక్షులు చెన్న విశ్వనాథంతో కలిసి పేట భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ… పట్టణంలోని తాళ్ల చెరువు, మద్దెలచెరువు, ఎఫ్టిఎల్ భూములు, కంచెరకుంట, పితిరికుంట, కుమ్మరి కుంట, లస్మాగౌడ్ కుంట, వాగు పరివాహక ప్రాంతం బపార్ జోన్, రోడ్లు, చెరువుల కాల్వలు, దేవాలయ, వక్ బొర్డ్ భూములు అన్యాక్రాంతం అవుతు కబ్జాదారుల కబంధ హస్తల్లో ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నయని ఆరోపించారు. రేపటి తరానికి నేచర్ అందించిన చెరువులను, కుంటలను కాపాడలని, పేరుకు పెద్దమనుషుల్లా వుంటు ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం సరికాదని, ఇకనైనా స్వచ్చందగా ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి అందించాలని కబ్జాదారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయంతో తెచ్చిన హైడ్రా చట్టం కోరుట్లలో కూడా అమలు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులును పేట భాస్కర్ కోరారు. ఈ సమావేశంలో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు చెన్న విశ్వనాథం, గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్యాల రాజేందర్, కార్మిక నేత సుతారి రాములు, కవి రాస భూమయ్య, జేఏసీ, అంబేద్కర్ సంఘాల నాయకులు శనిగారపు రాజేష్, జాగర్ల రాజయ్య, ఎస్ రాజయ్య, బింగి లక్ష్మీ కాంతం, అందె వంశీ, సామల్ల రాజేశం, ఎనుగందుల రాజనర్సయ్య, మరిపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



