
viswatelangana.com
June 6th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్,దావన్ పెల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై అధికారులు స్వీకరిస్తున్న దరఖాస్తులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ….. భూభారతి చట్టం ద్వారా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహశీల్దార్ నాగార్జున, ఆర్ఐ పద్మయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



