రెస్టారెంట్, బేకరీలు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు..

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని రెస్టారెంట్లు, బేకరీలు అలాగే టిఫిన్ సెంటర్లు లలో నిల్వ ఉంచిన పదార్థాలు మరియు నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై పుర అధికారులు శుక్రవారం తనిఖీ చేపట్టారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న రెస్టారెంట్లు బేకరీలు మరియు టిఫిన్ సెంటర్లు లకి అకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగల్ యూస్ ప్లాస్టిక్ మరియు నిలువ ఉంచిన పదార్థాలు ను స్వాధీనం పరుచుకొని సుమారుగా 18000/- రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచులు వాడాలని తెలిపారు.దీనిని ఉదేశించి మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించాలి లేని యెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుంది మరియు ట్రేడ్ లైసెన్స్ లేని వారు వెంటనే తీసుకోవాలి అని ఆయన తెలపడం జరిగింది. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి, హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు లేనిచో ఎస్డబ్ల్యుఎం-2019 చట్టం ప్రకారం జరిమానా విధించబడును.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్ మరియు బాలే అశోక్ లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి.మహేష్, మున్సిపల్ సిబ్బంది హేమంత్, రాజు మరియు జవాన్ రమేష్ పాల్గొన్నారు.



