జగిత్యాల

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బి.ఎస్ లత.

జగిత్యాల అదనపు కలెక్టర్ రాంబాబు బదిలీ

viswatelangana.com

October 28th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సూర్యాపేట జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీలు కాగా అందులో 24 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 46 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది., స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగి జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాంబాబును సూర్యాపేట అదనపు కలెక్టర్ బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్న అదనపు కలెక్టర్ బి.ఎస్ లతను జగిత్యాల కు బదిలీ చేశారు. బి.ఎస్ లత గతంలోనూ జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేశారు. కాగా కోరుట్ల ఆర్డిఓగా దివాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Back to top button