రాయికల్
ఇటిక్యాల ఫోకస్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

viswatelangana.com
September 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఫోకస్ యూత్ ఆధ్వర్యంలో శనివారం రోజున కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది.ఇటిక్యాల ఫోకస్ యూత్ వారు ఇప్పటికి వరుసగా 5సార్లు మట్టి వినాయకుణ్ణి ప్రతిష్టించి పూజించుకోవడం జరుగింది. మట్టి వినాయకుణ్ణి పూజించు పర్యావరణాన్ని రక్షించు అనే నినాదంతో వీరు ప్రతి ఏటా మట్టి వినాయకుణ్ణి పూజించడం విశేషం.ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో ఫోకస్ యూత్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.



