కోరుట్ల

రాజీవ్ యువ వికాసం గడువును పొడగించాలి

ఎం. జె. ఎఫ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపెల్లి లక్ష్మణ్

viswatelangana.com

April 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

రాజీవ్ యువ వికాసం గడువును పొడిగించాలని ఎం జె ఎఫ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, బెక్కెం అశోక్, లు కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసేవ లలో దరఖాస్తు చేసు కునేవారికి కులం, ఆదాయం, సరైన సమయానికి అందక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొందరి వద్ద కులం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ ఈ సంవత్సరంకు సంబంధించి ఆదాయం సర్టిఫికెట్ లేకపోవడంతో సర్టిఫికెట్లు తీసేసరికి కొంత ఇబ్బందికి గురవుతున్నారని, ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ 6 కోట్ల రుణాలను 60- 80%, వరకు రాయితీతో ఇవ్వనుంది. అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికెట్ ఆధార్, కుల, ధ్రువీకరణ పత్రం ఫోటో అవసరం ఉన్నదని ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

Back to top button